సుష్మాస్వరాజ్‌ కుమార్తె నామినేషన్‌ దాఖలు

సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని నగరంలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. దివంగత నేత సుష్మాస్వరాజ్‌ కుమార్తె బాన్సురి స్వరాజ్‌తోపాటు 13మంది మంగళవారం నామినేషన్లు వేశారు. న్యూఢిల్లీ నుంచి బిజెపి అభ్యర్థిగా రేసులో ఉన్న బాన్సురీ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడిరచారు. మొత్తంగా రూ.19కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉండగా.. వీటిలో రూ.11.27 కోట్లు చరాస్థులు, రూ.8కోట్లు విలువైన స్థిరాస్థులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, హరియాణాలోని పాల్వాల్‌లో రూ.99.34లక్షల విలువైన ఉమ్మడి ఆస్తిలో 6వ వంతుతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండు ఫ్లాట్లు, హేలీ రోడ్‌లో ఒక ఫ్లాట్‌ ఉన్నాయని తెలిపారు. 2023లో కొనుగోలు చేసిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో పాటు రెండు సొంత వాహనాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
వృత్తి రీత్యా న్యాయవాది అయిన 40ఏళ్ల బాన్సురి 2022`23 ఐటి రిటర్నుల్ల తన ఆదాయాన్ని రూ.68.28లక్షలుగా పేర్కొన్నారు. వార్‌విక్‌ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో బిఎ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆమె.. న్యాయవిద్యనభ్యసించడానికి లండన్‌ వెళ్లారు. అక్కడి బిపిపి లా స్కూల్‌లో న్యాయవిద్య పూర్తి చేసి…ఇన్నర్‌ టెంపుల్‌ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి బారిస్టర్‌గా అర్హత సాధించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ క్యాథఱిన్‌ కాలేజీ నుంచి 2009లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమె న్యాయవాది వృత్తిలో రాణిస్తూ ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు మే 25న ఎన్నికలు జరగనుండగా.. నిన్న మొదలైన నామినేషన్ల పర్వం మే 6 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు మొత్తంగా 26 మంది నామినేషన్లు వేసినట్లు ఢల్లీి చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వెల్లడిరచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *