టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా జట్టు ఇదే

మరో నెలరోజుల్లో వెస్టిండీస్‌/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ(BCCI) జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కాగా, హార్దిక్‌ పాండ్యను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు.
వికెట్ కీప‌ర్లుగా వాళ్లే
అంద‌రూ ఊహించ‌న‌ట్టుగానే వికెట్ కీప‌ర్లుగా రిష‌భ్ పంత్, సంజూ శాంస‌న్‌లు ప్రపంచ‌క‌ప్ స్క్వాడ్‌కు ఎంపిక‌య్యారు. ఇక ప‌దిహేడో సీజ‌న్‌లో ర‌ఫ్పాడిస్తున్న శివం దూబే .. 200 వికెట్ల‌తో చ‌రిత్ర సృష్టించిన య‌జ్వేంద్ర చాహ‌ల్‌ల‌కు సెలెక్ట‌ర్లు వ‌ర‌ల్డ్ క‌ప్ వీసా ఇచ్చేశారు. శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మ‌ద్, అర్షద్ ఖాన్‌లు రిజర్వ ప్లేయ‌ర్లుగా ఎంపిక‌య్యారు.
భార‌త స్క్వాడ్ : ఇదే రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వీ జైస్వాల్, సూర్య‌కుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌.
రిజ‌ర్వ్ ఆట‌గాళ్లు : శుభ్‌మ‌న్ గిల్, రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మ‌ద్, అర్ష‌ద్ ఖాన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *