గుంటూరు ఎంపి అభ్యర్థి ఆస్తుల విలువ రూ.5,700కోట్లు

అమరావతి: తన మొత్తం విలువ రూ.5,700కోట్లుగా ఉన్నట్లు గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయనకు రూ.2,316కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటితోపాటు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.2.67కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌ రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢల్లీిలో రూ.72కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. ఢల్లీిలో రూ.34.82కోట్ల విలువైన భవనం. అమెరికా రూ.28.26కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *